ప్రపంచంలో రెండో అతిపెద్ద తేనె ఎగుమతిదారుగా భారత్ అవతరించింది. 2020లో 9వ స్థానంలో ఉన్న భారత్ అనూహ్యమైన వృద్ధిని సాధించి ఈ ఘనతను అందుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి 1.07 లక్షల మెట్రిక్ టన్నుల సహజసిద్ధమైన తేనె ఎగుమతి కాగా, దీని విలువ 177.55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,480 కోట్లు) అని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'తీపి విప్లవం' ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. దేశంలో తేనెటీగల పెంపకాన్ని శాస్త్రీయంగా ప్రోత్సహించడం, నాణ్యమైన తేనె ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా 'నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్' ను ప్రభుత్వం అమలు చేస్తోంది.
రెండో అతిపెద్ద తేనె ఎగుమతిదారుగా అవతరించిన భారత్ !
الأحد، 2 نوفمبر 2025
'National Beekeeping and Honey Mission' business India becomes second largest honey exporter India ranked 9th in 2020 national
ليست هناك تعليقات:
إرسال تعليق