చెన్నై సెంట్రల్ - విజయవాడ వందే భారత్ నర్సాపురంకు పొడిగింపు

الجمعة، 7 نوفمبر 2025

Andhra Pradesh Chennai Central - Vijayawada Vande Bharat extended to Narsapuram indian railways soon and the schedule has already been finalized tamilnadu

t f B! P L


చెన్నై సెంట్రల్ - విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ను నర్సాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చెన్నై సెంట్రల్ లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే వందేభారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10 కి చేరుకుంటోంది. ఇక, ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించటంతో ఈ సర్వీసు 11.45 గంటలకు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి 11.50కి బయల్దేరి మధ్యాహ్నం 12.25కి గుడివాడ, 1.30కి భీమవరం, 2.10 కి నర్సాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురంలో బయలుదేరి 3.20కి భీమవరం, 4.10 కి గుడివాడ, 4.50 కి విజయవాడ చేరుతుంది. ఇక్కడి నుంచి 4.55 గంటలకు బయల్దేరి సాయంత్రం 5.20కి తెనాలి, 6.30కి ఒంగోలు, రాత్రి 7.40కి నెల్లూరు, 8.50కి గూడూరు, 9.50 కి రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ కు చేరుతుంది. తాజాగా పొడిగించిన మేరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం ప్రారంభం కానుంది. నర్సాపురంలో ఈ రైలు సర్వీసును అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం పైన కసరత్తు జరుగుతోంది. ఈ నెలలోనే ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా, విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా మరో వందేభారత్ సర్వీసు ప్రారంభం పైన అధికారులు ఫోకస్ చేసారు. త్వరలోనే ఈ సర్వీసు పైనా నిర్ణయం ఉంటుందని  ఇప్పటికే షెడ్యూల్ సైతం ఖరారైందని అధికారులు వెల్లడించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ