అద్దంకి-నార్కట్పల్లి హైవేపై బ్రాహ్మణపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. గీతిక స్కూల్ సమీపంలో వీరి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. మృతులను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులు తుళ్లూరు సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసేందుకు తమ కొత్త కారును తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ホーム
/
నలుగురు మృతి
/
కొత్త కారుకు పూజలు చేసి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి !
الأحد، 8 ديسمبر 2024
Andhra Pradesh Criem telangana కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో కొత్త కారుకు పూజలు చేసి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق