హైదరాబాద్‌లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఆకుపచ్చ చీర, మెడలో హారం, కాళ్లకు మెట్టెలు, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫోటో తరహాలోనే ఈ విగ్రహం ఉంది.

Post a Comment

Previous Post Next Post