జ్యోతిష్యుడు వేణు స్వామి తల్లి విజయలక్ష్మీ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని వేణు స్వామి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.'మా అమ్మగారు ఈ రోజు ఉదయం పరమపదించారు' అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.వేణు స్వామి సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. అయితే ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు.దాంతో ఈయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఇక నుంచి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని స్వయంగా సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాకు ఆయన దూరంగా ఉండాలని కోరుకుంటున్నా నెటిజన్స్ మాత్రం ఆయన్ను వదలడం లేదు.
Post a Comment