తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదు !


దివ్వెల మాధురిపై మూడు సెక్షన్ల కింద తిరుమల పోలీసులు కేసు నమోదు చేసినట్లు గురువారం వెల్లడించారు. ఇటీవల తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి రీల్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రీల్స్‌పై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ భార్య వాణి మీడియా ముందుకు రావడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో సందడి చేశారు. కొండపై దువ్వాడ, మాధురి ఫొటోషూట్, రీల్స్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి కంప్లైంట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Post a Comment

0 Comments