వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మంగళగిరి కోర్టు రిమాండ్ పొడిగించింది. తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మ హత్య కేసులో గుంటూరు జిల్లా జైలులో సురేశ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను విచారించేందుకు అనుమతినివ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు మొన్న 48 గంటల కస్టడీకి అనుమతినిచ్చింది. కస్టడీ గడువు నేటితో ముగియడంతో పోలీసులు ఆయనను తాజాగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయస్థానం నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ పొడిగింపు !
الاثنين، 21 أكتوبر 2024
Andhra Pradesh Criem నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ పొడిగింపు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వెలగపూడికి చెందిన మరియమ్మ హత్య కేసు
ليست هناك تعليقات:
إرسال تعليق