జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన నిబంధనలలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి. డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి. శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి. లైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ 21 గంటలు ఉండాలి. హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ ఆరు వారాల్లో పూర్తవుతుంది.
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్ ?
الأحد، 19 مايو 2024
Andhra Pradesh national telangana జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్ ? ప్రభుత్వ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది
ليست هناك تعليقات:
إرسال تعليق