శ్రీహరికోట నుంచి ప్రయోగంచిన GSLV-F17 విజయవంతంగా నింగిలోకి దూసుకెల్లింది. నిర్ణీత మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని 'EOS-05' శాటిలైట్ను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి అత్యంత ఖచ్చితత్వంతో ఇస్రో ప్రవేశపెట్టింది. రాకెట్ ప్రయోగం దిగ్విజయంగా పూర్తి కావడంతో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ సంతోషం వ్యక్తం చేస్తూ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. అనంతరం ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి చేరుకున్న EOS-05 ఉపగ్రహం భూమి నుంచి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ అత్యంత కీలకమైన సేవలను అందించనుంది. ముఖ్యంగా భారత సరిహద్దు ప్రాంతాల్లో శత్రుదేశాల కదలికలను నిరంతరం పసిగడుతూ, భూభాగాలను నిశితంగా పర్యవేక్షించడంలో ఈ ఉపగ్రహం రక్షణ వ్యవస్థలకు ప్రధాన బాసటగా నిలవనుంది. దేశ రక్షణ రంగంతో పాటు ముందస్తు విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులను అంచనా వేయడంలో కూడా ఈ ఉపగ్రహం పంపే సమాచారం ఎంతో కీలకం కానుంది. అధునాతన పేలోడ్స్తో రూపుదిద్దుకున్న ఈ ఆర్బిటర్ సమాచార సేకరణలో విప్లవాత్మక మార్పులు తేనుందని నిపుణులు భావిస్తున్నారు.
ホーム
/
technology
/
విజయవంతమైన GSLV-F17 ప్రయోగం : ఆర్బిటర్ సమాచార సేకరణలో విప్లవాత్మక మార్పులు
الجمعة، 4 سبتمبر 2026
ISRO Chairman Narayanan expressed his happiness national Revolutionary Changes in Orbital Data Collection science Successful GSLV-F17 Launch technology
ليست هناك تعليقات:
إرسال تعليق