ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెంలో తల్లపనేని నాగమ్మ 63 పిడుగు శబ్దానికి గుండె ఆగి మరణించారు. అదేవిధంగా లక్ష్మీపురంలో మేకల వెంకాయమ్మ 60 అనే మరో మహిళ సైతం గుండెపోటుతో మరణించారు. భారీ పిడుగుల శబ్దానికి వీరు ఉలిక్కిపడి మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రతిరోజు వర్షం పడుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
పిడుగుల శబ్దానికి ఇద్దరు మహిళ దుర్మరణం
الأحد، 13 سبتمبر 2026
63-year-old Tallapaneni Nagamma Andhra Pradesh Mekala Venkayamma (60) Palnadu district Two women die following loud thunderclaps
ليست هناك تعليقات:
إرسال تعليق