మెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించకుండా నిరోధించడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలు గత వేసవిలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ఉన్నాయని వాషింగ్టన్ డిసి ఫెడరల్ కోర్టు జడ్జి డెబోరా బోర్డ్‌మన్ తేల్చి చెప్పారు. 14వ రాజ్యాంగ సవరణను తోసిపుచ్చేలా ఉన్న ఈ ఉత్తర్వులు చట్టపరంగా నిలబడవని కోర్టు స్పష్టం చేసింది. ఫెడరల్ ఏజెన్సీలు తమ అంతర్గత మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవడానికి కోర్టు అనుమతించింది. ఈ స్టే ఉత్తర్వులు ప్రస్తుత పిటిషనర్లకు మాత్రమే తాత్కాలికంగా వర్తిస్తాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం, అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి శిశువుకు వారి తల్లిదండ్రుల వలస హోదాతో సంబంధం లేకుండా సహజంగానే పౌరసత్వం లభిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలు, ‘బర్త్ టూరిజం’ను అడ్డుకోవడానికి ఈ పౌరసత్వ హక్కులపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. తాత్కాలిక వీసాలపై ఉన్నవారు లేదా చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించకుండా నిరోధించడమే ఆయన ప్రధాన లక్ష్యం. గతంలో సుప్రీంకోర్టు మొదటి ఉత్తర్వులను కొట్టివేసినప్పటికీ, ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మార్పులతో మళ్లీ కొత్త ఆదేశాలు ఇచ్చింది.తల్లిదండ్రులలో ఎవరైనా శత్రు దేశ వలసదారులు, విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు లేదా బర్త్ టూరిజం ద్వారా వచ్చినవారైతే వారి పిల్లలకు పౌరసత్వం ఇవ్వకూడదని అందులో పేర్కొన్నారు. ఉత్తర్వుల పరిధిని తగ్గించినప్పటికీ, ఇది కూడా పరోక్షంగా 14వ సవరణను ఉల్లంఘించడమేనని డిస్ట్రిక్ట్ కోర్టు స్పష్టం చేస్తూ ఆ ఆదేశాలపై మళ్లీ బ్రేక్ వేసింది.

Post a Comment

أحدث أقدم