'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం

السبت، 19 سبتمبر 2026

Chief Minister Chandrababu Naidu State Government Organizes Prestigious 'Pattabhishekam for the Poor' Event Visakhapatnam

t f B! P L

విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని, వేలాది మంది లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల పట్టాలు, కన్వెయన్స్ డీడ్స్‌ను పంపిణీ చేశారు. ఇన్నాళ్లూ తాము ఉంటున్న స్థలాలపై ఎలాంటి వివాదాలు, భయాలు లేకుండా శాశ్వత హక్కులు దక్కడంతో లబ్ధిదారుల్లో అపరిమితమైన ఉత్సాహం, ఆనందం వ్యక్తమయ్యాయి. విశాఖ జిల్లాలోని 11 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న 399 ఎకరాల భూమిని (మొత్తంగా 19,33,853 చదరపు గజాల స్థలం) ప్రభుత్వం ప్రత్యేకంగా క్రమబద్ధీకరించింది. దీనిద్వారా 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు లభించాయి. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారమే ఈ భూమి విలువ రూ. 8,874 కోట్లుగా ఉండగా, బహిరంగ మార్కెట్లో దీని విలువ మరింత ఎక్కువే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పేదలకు లభించిన ఈ ఆస్తి వారి భవిష్యత్తుకు కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇస్తుందని, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని తొందరపడి విలువైన భూములను అమ్ముకోవద్దని సీఎం లబ్ధిదారులకు హితవు పలికారు. సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. "నేను నా జీవితంలో ఎన్నో వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ ఈ రోజు మీ ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులు, ఆనందం చూస్తుంటే నా జన్మ ధన్యమైంది. 40 ఏళ్ల క్రితమే పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనే గొప్ప ఆలోచనతో స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. అదే స్ఫూర్తితో మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నాడు ఎన్నికల ప్రచారంలో నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీని ఈ రోజు నిలబెట్టుకుని చూపిస్తున్నాం" అని పేర్కొన్నారు. 'మీ భూమి-మీ హక్కు' ద్వారా ప్రజలను దశాబ్దాల రెవెన్యూ తిప్పల నుంచి విముక్తి చేస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత ఆస్తులు, పాస్ పుస్తకాలపై తమ బొమ్మలు వేసుకుని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, కానీ తమ ప్రభుత్వం అత్యంత పవిత్రమైన 'రాజముద్ర'తో పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తోందని వివరించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 12 వేల కుటుంబాలకు భూములు క్రమబద్ధీకరించి పట్టాలు ఇచ్చామని, ఇప్పుడు విశాఖలో ఈ మహత్కార్యాన్ని పూర్తి చేశామని చెప్పారు. పేదలు తమ హక్కుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి రాకూడదన్నదే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎప్పటినుంచో నలుగుతున్న సమస్యలపై సీఎం స్పందిస్తూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా 35 కాలనీల్లో ఉన్న 10 వేల కుటుంబాలతో పాటు, సుదీర్ఘకాలంగా నలుగుతున్న 'పంచగ్రామాల' పరిధిలోని 12,149 కుటుంబాలకు పట్టాలు రావాల్సి ఉందన్నారు. ఈ మొత్తం 22 వేల కుటుంబాలకు కూడా వీలైనంత త్వరలోనే శాశ్వత హక్కులతో పట్టాలు అందిస్తామని ప్రకటించారు. దేవాదాయ శాఖ భూముల్లో నివాసాలు ఉంటున్న నిరుపేదలకు కూడా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి ఆత్మగౌరవంతో కూడిన సొంతింటి శాశ్వత చిరునామాను అందివ్వడమే లక్ష్యమని, అందులో భాగంగానే రెండేళ్ల వ్యవధిలో 5 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించామని, వచ్చే మార్చి నాటికి మరో 5 లక్షల గృహాలను పూర్తి చేస్తామని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తమ విధానమని చాటిచెప్పారు. విశాఖపట్నం ప్రజలు తనపై చూపే ఎనలేని అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ, హుద్‌హుద్ తుపాను కష్టకాలంలో విశాఖ వాసులు అందించిన సహకారాన్ని తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ