ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి యండపల్లి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుండి విజయనగరం వెళుతున్న జగన్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. క్లీనర్ వైపు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండగా, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. బస్సులోని 24 మందికి గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో ఏపీలో చాలా బస్సు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు : క్లీనర్ దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం
السبت، 12 سبتمبر 2026
Andhra Pradesh Cleaner Killed Greenfield Highway near Yandapalli in the Chintalapudi area of Eluru district Private Bus Rams into Stationary Lorry Two in Critical Condition
ليست هناك تعليقات:
إرسال تعليق