ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన హోంమంత్రి వంగలపూడి అనితకు డ్రోన్ తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. తిరుపతిలో అత్యంత వైభవంగా ప్రారంభమైన అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకను కవర్ చేయడానికి, అట్టహాసంగా నిర్వహించడానికి నిర్వాహకులు అక్కడే ఓ డ్రోన్ను గాల్లోకి ఎగరవేశారు. అయితే, ఆ సమయంలో అకస్మాత్తుగా డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి కిందికి పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న హోంమంత్రి అనిత చేతికి డ్రోన్ తగడంతో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ కొద్దిసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే పెద్ద ప్రమాదం ఏమీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ : హాజరైన హోంమంత్రి వంగలపూడి అనితకు డ్రోన్ తగలడంతో స్వల్ప గాయాలు
الاثنين، 24 أغسطس 2026
Amaravati Championship in Tirupati Andhra Pradesh Home Minister Vangalapudi Anitha Sustains Minor Injuries After Being Hit by a Drone Tirupati
ليست هناك تعليقات:
إرسال تعليق