Ad Code

క్రిమిసంహారక మందు కలిపిన శనగల నుండి వెలువడిన విషపూరిత వాయువులను పీల్చి ఇద్దరు చిన్నారులు దుర్మరణం


హారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో క్రిమిసంహారక మందు కలిపిన శనగల నుండి వెలువడిన విషపూరిత వాయువులను పీల్చడంతో నాలుగేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారి అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. నాందేడ్ జిల్లా బాలాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ దేబేకర్ కుమార్తెలు ఆరోహి దేబేకర్, ఆమె చెల్లెలు ఆరాధ్య దేబేకర్లుగా కుటుంబ సభ్యులు వారిని గుర్తించారు. పురుగుల బారిన పడకుండా ఉండేందుకు పురుగుమందు కలిపిన శనగలను నిల్వ ఉంచిన గదిలోనే గురువారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రించారు. తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉండటంతో ఆ రసాయనం నుంచి వెలువడిన ప్రమాదకర వాయువులు గది అంతటా వ్యాపించాయి. రాజకీయ, సామాజిక వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనలో రాత్రి వేళ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వాంతులు చేసుకున్నారు. అయితే చిన్నారుల శరీరాలు ఆ తీవ్రమైన విష రసాయనాన్ని తట్టుకోలేకపోవడంతో ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో గురువారం రోజే చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu