Ad Code

విడాకులు కోరిన భార్య : మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త

ర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ ఎంఎన్‌సీలో పనిచేస్తున్న 36 ఏళ్ల ఉద్యోగి తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. భార్య విడాకులు కోరడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతున్నప్పటికీ, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అనుమానాస్పద మరణమని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం, సంజీవ్ యాదవ్ (36) అమృత్‌సర్‌కు చెందినవాడు. ప్రస్తుతం గురుగ్రామ్‌లోని సూరత్ నగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు డెన్సో సంస్థలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఇంట్లో భార్య మన్‌ప్రీత్ కౌర్, ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్న సమయంలో సంజీవ్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. అనంతరం మన్‌ప్రీత్ ఇరు కుటుంబాలకు ఫోన్ చేసి ఘటన గురించి సమాచారం ఇచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu