Ad Code

సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం : సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే సంపూర్ణ మద్దతు

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగడంతో జార్ఖండ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విద్యార్థులు గత ఆరు రోజులుగా రాంచీలో భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగాయని విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విమర్శలు వెల్లువెత్తడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు సీఎం హేమంత్ సోరెన్ సీఐడీ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ విచారణల వల్ల ప్రయోజనం లేదని, సీఎం హేమంత్ సోరెన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu