స్టాక్ మార్కెట్లోకి షిప్రాకెట్, మిల్కీ మిస్ట్, ధూత్ ట్రాన్స్మిషన్ సహా ఐదు కంపెనీలు ఈవారం ఐపీఓకి రానున్నాయి. మార్కెట్ నుంచి రూ.7,400 కోట్లకు పైగా నిధులు సమీకరించాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నిధులను వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపులకు వాడనున్నారు. ఈ కొత్త వాటితో కలిపి 2026లో ఐపీఓకి వచ్చిన కంపెనీల సంఖ్య 47కు చేరనుంది.
0 Comments