ఉత్తరప్రదేశ్లోని బస్టాండ్లో డ్రైవర్ల బాధ్యతా రాహిత్యం, తీవ్ర నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. బస్సు ఎక్కేందుకు వెళ్తున్న క్రమంలో రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఖేతుయ్ గ్రామానికి చెందిన నేహా సింగ్ అనే మహిళ ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రోజున కంపెనీ అధికారిక మీటింగ్ కోసం ఉన్నావ్లోని బాంగర్మౌ వెళ్లేందుకు ఆమె హర్దోయ్ బస్టాండ్కు చేరుకున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.
0 Comments