కేంద్ర ప్రభుత్వాన్ని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే తీవ్రస్థాయిలో హెచ్చరించారు. విద్యార్థుల నిరసనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో వీడియోలు చాలా బాగా చేస్తున్నారు. ఆయనకు అంతగా ఆసక్తి ఉంటే ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా స్థిరపడవచ్చు" అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పబ్లిసిటీకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల పట్ల పోలీసులు మరియు ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని అభిజిత్ మండిపడ్డారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరింపులకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థులేమైనా దేశద్రోహులా లేక ఉగ్రవాదులా? ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈనాటి విద్యార్థులే. అలాంటి వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడటం అత్యంత దారుణమన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ తుపాకులు ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన…విద్యార్థులపై ఇటువంటి బలప్రయోగానికి మరియు పెల్లెట్ తుపాకులు వాడటానికి అనుమతి ఇచ్చిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదు : అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం : అభిజిత్ దిప్కే
الخميس، 30 يوليو 2026
"We will not back down until the issues are resolved national says Abhijit Dipke we will intensify the agitation if necessary
ليست هناك تعليقات:
إرسال تعليق