Ad Code

ఇన్ఫోసిస్‌కు రూ.1.9 కోట్ల జరిమానా విధించిన ఫ్రాన్స్ ప్రభుత్వం : ఎంప్లాయి టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ తమ దేశ కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఉందన్న ఫ్రాన్స్

న్ఫోసిస్‌ ఉద్యోగుల పని గంటలను పర్యవేక్షించే ఎంప్లాయి టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ తమ దేశ కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఫ్రాన్స్ ప్రభుత్వం సుమారు రూ.1.9 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం. ఫ్రాన్స్‌లో ఉద్యోగుల హక్కులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ పూర్తి స్థాయి ఉద్యోగులు సాధారణంగా వారానికి 35 నుంచి గరిష్ఠంగా 48 గంటల వరకు మాత్రమే పని చేయాలి. అంతకుమించి పనిచేస్తే దానిని ఓవర్‌టైమ్‌గా పరిగణించి అదనపు వేతనం, ఇతర ప్రయోజనాలు కల్పించడం తప్పనిసరి. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల పని గంటలను పర్యవేక్షించే ఇన్ఫోసిస్ విధానంపై ఫ్రాన్స్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువత వారానికి 70 నుంచి 72 గంటలు పనిచేస్తేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని గంటలపై కఠినమైన చట్టాలు అమల్లో ఉండగా, ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు చేస్తున్నారు. అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలేనని, అవి సంస్థ అధికారిక విధానాన్ని ప్రతిబింబించవని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ఫ్రాన్స్ చర్య ఉద్యోగుల హక్కులు, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతకు అక్కడ ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి స్పష్టం చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పని గంటలు, కార్మిక చట్టాలు, సంస్థల బాధ్యతలపై మరోసారి చర్చ మొదలైంది.

Post a Comment

0 Comments

Close Menu