పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుస్తకాలను ప్రభుత్వం లైబ్రరీల నుంచి తొలగించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ గ్రంథాలయ సేవల మంత్రి గౌరీ శంకర్ ఘోష్ చెప్పారు. జ్ఞానం, మేధో వికాసం, జాతీయవాద భావాలకు దోహదపడే పుస్తకాలు లైబ్రరీల్లో ఉంచబోతున్నట్లు చెప్పారు. 'ఎపాంగ్ ఓపాంగ్ ఝపాంత్' వంటి పుస్తకాలకు లైబ్రరీల్లో చోటు ఉండదని స్పష్టం చేశారు. రవీంద్రనాథ్ టాగోర్, కాజీ నజ్రుల్ ఇస్లాం, స్వామి వివేకానంద వంటి సాహిత్య, ఆధ్యాత్మిక దిగ్గజాల రచనలతో పాటు, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ వంటి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో ఏడాది క్రితం లైబ్రరీల్లో ఆమె రచించిన పుస్తకాలను చేర్చాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2025లో టీఎంసీ సర్కార్ పాఠశాల లైబ్రరీల కోసం 515 పుస్తకాలను ఆమోదించింది. వీటిలో 90 పుస్తకాలు మమతా బెనర్జీ రచించినవే. ఇప్పుడు వీటిని తొలగించేందుకు బీజేపీ సర్కార్ సిద్ధమైంది.
ホーム
/
west bengal
/
'ఎపాంగ్ ఓపాంగ్ ఝపాంత్' వంటి పుస్తకాలకు లైబ్రరీల్లో చోటు ఉండదు : బెంగాల్ మంత్రి గౌరీ శంకర్ ఘోష్
الجمعة، 12 يونيو 2026
Minister Gauri Shankar Ghosh national No place in libraries for books like 'Epang Opang Jhapant' remove Mamata Banerjee books west bengal
ليست هناك تعليقات:
إرسال تعليق