దేశంలో రుతుపవనాలు వేగం పుంజుకుని ముందుకు సాగుతున్నాయని భారత వాతారణ శాఖ తెలిపింది. దీంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తుఫాను, వర్షాల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటిలో జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ, గోవా, తెలంగాణ ఉన్నాయి. ఈరోజు కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మే 25వ తేదీన ఢిల్లీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలి, ధర్మశాలలో మే 29 వరకు ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, నైనిటాల్, హరిద్వార్లలో వాతావరణం మారుతోంది. మే 25వ తేదీన బలమైన గాలులతో పాటు వర్షం, వడగళ్ళు పడే అవకాశం ఉంది. మే 24, 25 తేదీలలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, జమ్మూ, పహల్గామ్లలో ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
వేగం పుంజుకున్న రుతుపవనాలు
الأحد، 24 مايو 2026
India Meteorological Department has reported issued warnings regarding storms and rainfall for several states and Union Territories Monsoons Gather Momentum national
ليست هناك تعليقات:
إرسال تعليق