ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో తిరుపతిలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. దీనిలో పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ల పనితీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కార్యకర్తలు, వారిని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశం జరుగుతుండగానే పలువురు కార్యకర్తలు లేచి మాట్లాడటం అక్కడ కొంత గందరగోళానికి దారితీసింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను ఇన్ఛార్జ్లు పట్టించుకోవడం లేదు అంటూ వారు మండిపడ్డారు. ఇన్ఛార్జ్లు కార్యకర్తలతో సరైన రీతిలో వ్యవహరించడం లేదని, కొందరు నేతలు కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. పార్టీ కోసం పని చేస్తున్న వారిలో అసంతృప్తి పెరుగుతోందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్క కార్యకర్త కూడా సంతృప్తిగా లేడు అంటూ పలువురు నేతలు ఇన్ఛార్జ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ పరిణామాలు జనసేనలో అంతర్గత అసంతృప్తిని బయటపెట్టినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తిరుపతి జనసేన సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కార్యకర్తలు
السبت، 9 مايو 2026
Activists Express Dissatisfaction at Tirupati Jana Sena Meeting and Anantapur districts of Andhra Pradesh kadapa
ليست هناك تعليقات:
إرسال تعليق