తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలో అంజనేయులు (40) అనే వ్యక్తి మిత్రులతో కలిసి విందు భోజనానికి వెళ్లి మాంసం ముక్క గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస అందక మరణించాడు. సంకలమద్ది గ్రామానికి చెందిన అంజనేయులు వృత్తిరీత్యా పెయింటర్. ఏప్రిల్ 15న ఇద్దరు మిత్రులతో కలిసి కందూరు స్టేజీ సమీపంలో భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్న సమయంలో ఒక పెద్ద మాంసం ముక్క అనుకోకుండా అతని గొంతులో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో నీళ్లు తాగి సర్దుకున్నట్లు అనిపించినా, ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పరిస్థితి విషమించింది. గొంతులో ఇరుక్కున్న ముక్క శ్వాసనాళాన్ని పూర్తిగా అడ్డుకోవడంతో అంజనేయులుకు ఊపిరి అందలేదు. దీంతో అతను వాహనంపైనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అయితే, అతనితో ఉన్న మిత్రులు భయంతో మృతదేహాన్ని మూసాపేటలోని ఒక కల్లు దుకాణం వద్ద వదిలి పారిపోవడం గమనార్హం. గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదికలో శ్వాస నిలిచిపోవడం వల్లే మరణం సంభవించిందని వైద్యులు ధృవీకరించారు.
గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి
الجمعة، 17 أبريل 2026
crime Mahabubnagar district Man Dies After Piece of Meat Gets Stuck in Throat Moosapet Mandal telangana
ليست هناك تعليقات:
إرسال تعليق