తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని టీజీ ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ఫలితాలపై కార్మికుల భవిష్యత్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. చర్చల అనంతరం సమ్మె తేదీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు జేఏసీ వర్గాలు తెలిపాయి. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో కార్మికులు చేరుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వకపోతే సమ్మె తప్పదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్చి 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు వేతనాలు, సర్వీస్ సమస్యలు, బెనిఫిట్స్ వంటి అంశాలపై దీర్ఘకాలంగా అసంతృప్తితో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఆందోళన తీవ్రత పెరుగుతోంది. సమ్మెకు వెళ్లాల్సి వస్తే దాని బాధ్యత ప్రభుత్వానిదేనని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఈ దశకు చేరిందని వారు పేర్కొన్నారు.
సమ్మెకు సిద్ధమవుతున్న టీజీ ఆర్టీసీ కార్మికులు
الاثنين، 13 أبريل 2026
JAC has made it clear that its members will go on strike starting the 20th of this month telangana TG RTC Workers Prepare for Strike
ليست هناك تعليقات:
إرسال تعليق