తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆమెకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును వివరించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానాన్ని వివరించారు. లడ్డూ ప్రసాదం తయారీ, ట్రాఫిక్ నిర్వహణ, వసతి సదుపాయాల సమన్వయం వంటి అంశాలను వివరించారు. భక్తుల భద్రతకు టీటీడీ చేస్తున్న కృషిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందించారు.
ホーム
/
temple officials and priests accorded her a grand welcome in accordance with temple protocols
/
తిరుమలలో శ్రీవారి సేవలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
الأربعاء، 15 أبريل 2026
Andhra Pradesh bhakti Delhi Chief Minister Rekha Gupta Offers Prayers to Lord Srivari in Tirumala temple officials and priests accorded her a grand welcome in accordance with temple protocols
ليست هناك تعليقات:
إرسال تعليق