ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఏడు చోట్ల జరిగిన దొంగతనం కేసుల్లో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ మాధవరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏడు కేసుల్లో 90గ్రాముల బంగారం, 30 తులాలు వెండి, 90,000 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాచిపెంట మండలం చినచీపురువలస ఏప్రిల్ 11న ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఫింగర్ ప్రింట్ ఆధారంగా గొల్లపల్లి సాయి కుమార్ నీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఇతర ముద్దాయిలు పేర్లు వెల్లడించినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. నలుగురుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించిన ఎస్పీ తెలిపారు. వీరిలో ఇద్దరుమానాపురం పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులో పట్టుబడినట్టు ఎస్పీ తెలిపారు.
దొంగతనం కేసుల్లో నలుగురు నిందితుల అరెస్ట్ : 90గ్రాముల బంగారం, 30 తులాలు వెండి, 90,000 వేలు నగదును స్వాధీనం
الاثنين، 20 أبريل 2026
000 in Cash Recovered 30 Tolas of Silver 90 Grams of Gold and ₹90 Andhra Pradesh Four Accused Arrested in Theft Cases Parvathipuram Manyam district
ليست هناك تعليقات:
إرسال تعليق