ఆంధ్రప్రదేశ్లో ఫస్టియర్తో పాటు సెకండియర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత 12 ఏళ్ల రికార్డును ఈ సారి ఇంటర్ ఫలితాలు బ్రేక్ చేశాయని విద్యాశాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక తెలియజేశారు. ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన మిత్ర వాట్సాప్ సేవ ద్వారా 9552300009 నంబర్కు "Hi" అని మెసేజ్ పంపి కూడా ఫలితాలు తెలుసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన పురోగతి నమోదైంది. మొదటి సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రెండో సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత 12 ఏళ్లలో ఇది అత్యధిక ఫలితాలుగా ప్రభుత్వం వెల్లడించింది. రెండో సంవత్సరంలో నమోదైన ఉత్తీర్ణత శాతం గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ఫలితంగా నిలిచింది. ప్రత్యేకంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో ఈసారి మంచి ఫలితాలు రావడం విశేషం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 54గా నమోదై గత 12 ఏళ్లలో అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. రెండో సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి విద్యార్థుల కృషి, ప్రిన్సిపాళ్ల మార్గదర్శకత్వం, జూనియర్ లెక్చరర్ల శ్రమతో పాటు విద్యా శాఖ సమన్వయ కృషే కారణమని అధికారులు పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల పెంపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు మంత్రి నారా లోకేష్… ఈ అపజయాన్ని విజయానికి తొలి మెట్టుగా భావించి మరింత కష్టపడి ముందుకు సాగాలని ప్రోత్సహించారు. విద్యార్థులకు ఈ సమయంలో తల్లిదండ్రులు, కళాశాలలు, సమాజం నైతిక మద్దతుగా నిలవాలని కోరారు. విద్యార్థులందరికీ భవిష్యత్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదల : గత 12 ఏళ్లలో అత్యధిక ఫలితాలుగా ప్రభుత్వం వెల్లడి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق