గత ఏడాది నుంచి టెక్ మార్కెట్లో ఏఐ ఓ ట్రెండ్గా మారింది. స్మార్ట్ఫోన్ల నుంచి ఫ్రిజ్లు, టీవీల వరకు AI ఫీచర్లు చేరాయి. ఇప్పుడు ల్యాప్టాప్లలో కూడా AI ఇంటిగ్రేషన్ పెరుగుతోంది. ఈ గ్లోబల్ AI బూమ్ కారణంగా మెమరీ, స్టోరేజ్, సీపీయూ వంటి భాగాల ధరలు పెరుగుతున్నాయి. 2026లో ల్యాప్టాప్ ధరలు 35-40% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ల్యాప్టాప్లలో CPU, GPU అనే రెండు చిప్స్ మాత్రమే ఉంటాయి. కానీ AI ల్యాప్టాప్లలో మూడో ప్రత్యేక ప్రాసెసర్ ఎన్పీయూఉంటుంది. ఈ NPU వల్ల ఫొటోల గుర్తింపు, భాషను అర్థం చేసుకోవడం, టెక్స్ట్ ప్రాసెసింగ్ వంటి AI పనులు ఇంటర్నెట్ లేకుండానే ల్యాప్టాప్లోనే జరుగుతాయి. దీంతో వేగం పెరుగుతుంది, ప్రైవసీ కూడా మెరుగవుతుంది. లైవ్ ట్రాన్స్లేషన్, సబ్టైటిల్స్: వీడియో కాల్ సమయంలో మాట్లాడిన భాషను వెంటనే టెక్స్ట్గా మార్చుతుంది. లోకల్ AI అసిస్టెంట్: ఫైల్ సెర్చ్, రైటింగ్, ఎడిటింగ్ పనులు ఆఫ్లైన్లోనే వేగంగా జరుగుతాయి. ఆటో బ్యాక్గ్రౌండ్ బ్లర్, నాయిస్ క్యాన్సిలేషన్. NPU వల్ల CPU-GPU మీద లోడ్ తగ్గుతుంది. AI ల్యాప్టాప్లు సాధారణ మోడళ్లతో పోలిస్తే 15-25% వరకు ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఉదాహరణకు, లెనోవా AI సిరీస్ ల్యాప్టాప్లు సుమారు రూ. 94,000 నుంచి ప్రారంభమవుతాయి. అదే సమయంలో సాధారణ i7 ల్యాప్టాప్లు రూ. 71,000 నుంచి లభిస్తాయి.
భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్న ఏఐ ల్యాప్టాప్లు !
السبت، 21 مارس 2026
AI Laptops AI-driven tasks—such as image recognition business natural language understanding science Set to Play a Key Role in the Future technology Thanks to this NPU
ليست هناك تعليقات:
إرسال تعليق