ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కి సంబంధించిన డ్రగ్స్ వ్యవహారంపై సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. నిన్న డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వ్యక్తి ఇవాళ పార్లమెంట్కు ఎలా వచ్చాడని రాజ్దీప్ ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఒక్క రోజులోనే బెయిల్ ఎలా లభించిందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తికి ఇంత వేగంగా బెయిల్ రావడం సాధ్యమేనా అని కూడా ప్రశ్నించారు. డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన వారి మాటలు ఏమయ్యాయని రాజ్దీప్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పినవారు ఇప్పుడు ఈ ఘటనపై ఏమి చెబుతారని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనా లేక కొందరికి ప్రత్యేక సౌకర్యాలున్నాయా అనే సందేహం కూడా వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ వంటి తీవ్రమైన అంశాల్లో పారదర్శకత ఉండాలని రాజ్దీప్ సూచించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నిన్న డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వ్యక్తి ఇవాళ పార్లమెంట్కు ఎలా వచ్చాడు ?
الاثنين، 16 مارس 2026
Andhra Pradesh How did a person arrested in a drugs case yesterday manage to attend Parliament today? Naional Senior Journalist Rajdeep Sardesai telangana
ليست هناك تعليقات:
إرسال تعليق