తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎక్స్ వేదికగా ద్వారా హింసకు భవిష్యత్తు లేదు, శాంతికి మాత్రమే ఉంది. ఇంకా అండర్గ్రౌండ్లో ఉన్న వారికి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను - ముప్పల్లా లక్ష్మణ రావు అలియాస్ గణపతి, పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్థా శేఖర్ అలియాస్ మంగ్తు, జోడె రత్నబాయి అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, వీరందరూ ఆయుధాలు పడేసి, గౌరవం, భద్రత, చెందుబాటు కలిగిన జీవితాన్ని ఎంచుకోవాలని కోరారు. గత రెండు సంవత్సరాల్లో 721 మంది వ్యక్తులు ఈ మార్గాన్ని విశ్వసించి, మెయిన్స్ట్రీమ్లో విజయవంతంగా తిరిగి చేరుకున్నారు. మా పునరావాస విధానం ద్వారా తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. ఇంకా తమ కుటుంబాల నుంచి దూరంగా ఉన్నవారికి, ఇది మీ తిరిగి వచ్చే సమయం. తెలంగాణ ప్రభుత్వం మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేవలం పునరావాసం మాత్రమే కాదు, గౌరవంతో, అవకాశాలతో, శ్రద్ధతో. అవసరమైన వారికి ప్రత్యేక హామీ ఇస్తున్నాం, అందులో అధునాతన వైద్య సహాయం కూడా ఉంది. మీ శ్రేయస్సు మాకు ముఖ్యం. హింసను వదిలి, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, మంచి రేపటి వైపు కలిసి ముందుకు సాగుదామని డీజీపీ కోరారు.
మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి !
الثلاثاء، 31 مارس 2026
Jode Ratnabai (alias Sujatha) Muppalla Lakshmana Rao Nakka Susheela national Pusunuri Narahari Telangana DGP Shivadhar Reddy Appeals to Maoists via 'X' Vardha Shekhar (alias Mangthu)
ليست هناك تعليقات:
إرسال تعليق