ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో స్థానిక పలకల క్వారీల సమీపంలో గురువారం ఉదయం ప్రైవేట్ బస్, టిప్పర్ ఢీకొనడంతో రెండు వాహనాలూ మంటల్లో చిక్కుకున్నాయి. బస్లో ప్రయాణిస్తున్న 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, మరికొందరు గాయపడినట్లు మార్కాపురం ఇంచార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బస్లో ప్రయాణించినవారిలో 14 మంది చనిపోగా 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించామని వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇంచార్జ్ ఎస్పీ తెలిపారు ప్రమాదానికి గురైన బస్ తెలంగాణలోని జగిత్యాల నుంచి కలిగిరికి వస్తోందని చెప్పిన ఆయన మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయాణికులు ఉండొచ్చని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను బస్సు నుంచి వెలికి తీశామని మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్ చెప్పారు. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్, టిప్పర్ ఢీ : 14 మంది దుర్మరణం, 20 మందికి గాయాలు
الخميس، 26 مارس 2026
14 Dead 20 injured Andhra Pradesh crime Markapuram district Private Travel Bus Collides with Tipper Rayavaram telangana
ليست هناك تعليقات:
إرسال تعليق