దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉందని, కానీ ఈ ఒప్పందం పూర్తి చేయడానికి ఇంకా కొన్ని దశలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఆమె ఈ ఫోరమ్లో మాట్లాడతూ 'ఇంకా చేయాల్సిన పని ఉంది. కానీ మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉన్నాము. కొందరు దీన్ని అన్ని ఒప్పందాలకు తల్లి అని పిలుస్తారు. ఇది 2 బిలియన్ల ప్రజల మార్కెట్ను సృష్టిస్తుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు ఉంటుంది' అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య భాగస్వామ్యాలను విస్తృతం చేయడానికి, వైవిధ్యపరచడానికి యూరోపియన్ యూనియన్ దృష్టి సారించినట్లు తెలిపారు. వచ్చే వారాంతంలో భారతదేశానికి వెళ్తానని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుపుతానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ సిద్ధం !
الثلاثاء، 20 يناير 2026
European Union ready for a free trade agreement with India European Commission President Ursula von der Leyen international Speaking at the World Economic Forum in Davos
ليست هناك تعليقات:
إرسال تعليق