ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్ఖివ్ నగరాల్లో రష్యా మరోసారి దాడులకు పాల్పడింది. డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. మరోవైపు అమెరికా- ఉక్రెయిన్- రష్యా మధ్య త్రీ సభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రష్యా దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకుపైగా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఖార్ఖివ్ నగరాల్లో ఈ దాడులు చేపట్టింది రష్యా సైన్యం. ఈ డ్రోన్ దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. ఇక ఈ దాడులపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్నా.. త్రిసభ్య సమావేశం జరుగుతున్నా.. ఉక్రెయిన్ ప్రజలకు మాత్రం మరో నిద్ర లేని రాత్రిగా ఈ రోజు మిగిలింది.. అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా యూఏఈలో జనవరి 23నుండి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దావోస్ అంతర్జాతీయ సదస్సు వేదికగా ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు రెండు రోజుల పాటు ఈ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. 2022లో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఒకే వేదికపై చర్చలు నిర్వహించనున్నారు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దావోస్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ముడేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధం ముగియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్ఖివ్ నగరాలపై రష్యా మరోసారి దాడులు
السبت، 24 يناير 2026
international one person was killed and 15 others were injured Russia attacks Kyiv and Kharkiv cities in Ukraine again trilateral meeting between the US Ukraine
ليست هناك تعليقات:
إرسال تعليق