విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబో ఏఎస్సీ అర్జున్ ను భారతీయ రైల్వే భద్రతా దళం ఆవిష్కరించింది. ఇది కేవలం ఒక యంత్రం కాదు. ఒక కదిలే భద్రతా వ్యవస్థ. కేవలం మనుషులకే సాధ్యమని భావించిన గస్తీ పనిని, కృత్రిమ మేధస్సు సాయంతో అత్యంత కచ్చితంగా నిర్వహిస్తోంది. దీనిలో ఉన్న హై-రిజల్యూషన్ కెమెరాలు కేవలం ఫోటోలు తీయడమే కాకుండా ఫేస్ రికగ్నిషన్ ద్వారా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను లేదా అనుమానితులను రద్దీలో కూడా ఇట్టే గుర్తుపట్టేస్తాయి. పొగను లేదా మంటలను పసిగట్టగానే వెంటనే కంట్రోల్ రూమ్కు సిగ్నల్ పంపుతుంది. ప్రమాదం జరగకముందే అప్రమత్తం చేయడంలో ఇది మేటి. ప్రయాణికులకు సలహాలు ఇవ్వాలన్నా, భద్రతా సూచనలు చేయాలన్నా ఇది సిద్ధం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్పష్టంగా మాట్లాడుతూ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. స్టేషన్ ఎక్కడ? ట్రైన్ ఎప్పుడు వస్తుంది? వంటి వివరాల నుంచి "అపరిచిత వస్తువులను తాకకండి" అనే హెచ్చరికల వరకు అన్నీ అర్జున్ చూసుకుంటున్నాడు. స్టేషన్ ప్లాట్ఫామ్లపై రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? ఎవరైనా అనవసరంగా గుమిగూడుతున్నారా? అనే విషయాలను ఏఐ అనలిటిక్స్ ద్వారా ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ రోబో ఇచ్చే 'రియల్ టైమ్ అలర్ట్స్' వల్ల ఆర్పీఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించే అవకాశం ఉంటుంది. ఫలితంగా చైన్ స్నాచింగ్స్, జేబు దొంగతనాలు వంటి నేరాలకు అడ్డుకట్ట పడనుంది. విశాఖలో మొదలైన ఈ 'రోబో గస్తీ' త్వరలోనే దేశంలోని ఇతర ప్రధాన స్టేషన్లకు విస్తరించనుంది. మనుషుల శ్రమకు యంత్రాల వేగం తోడైతే భద్రత ఎంత పటిష్టంగా మారుతుందో చెప్పడానికి 'అర్జున్' ఒక ఉదాహరణ.
హ్యూమనాయిడ్ రోబో ఏఎస్సీ అర్జున్ ఆవిష్కరించిన భారతీయ రైల్వే భద్రతా దళం
الجمعة، 23 يناير 2026
Andhra Pradesh Indian Railway Protection Force unveils humanoid robot ASC Arjun national science technology Visakhapatnam Railway Station
ليست هناك تعليقات:
إرسال تعليق