హైదరాబాద్ - చెన్నై ఎగ్మోర్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ లో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారు ఈ మార్పును గమనించాల్సి కోరింది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా ఈ రైలును తాంబరం స్టేషన్ వరకూ కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల మీదుగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసునేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12760 ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ చెన్నై బీచ్ వరకూ మాత్రమే ప్రయాణాలు సాగిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు చెన్నై బీచ్ కు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. అలాగే తాంబరం స్టేషన్ కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ నంబర్ 12759 మార్పు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చి ఏప్రిల్ 5 వరకూ ఉంటుంది. ఈ రైలు చెన్నై బీచ్ నుంచి సాయంత్రం 6.20కు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు : తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం
الخميس، 29 يناير 2026
Andhra Pradesh Key change in Charminar Express South Central Railway tamilnadu telangana Temporarily limited to Chennai Beach Railway Station
ليست هناك تعليقات:
إرسال تعليق