ఉద్యోగ భవిష్యనిధి సంస్థ కంట్రిబ్యూషన్ ప్రస్తుత వేతన పరిమితి గత పదకొండు సంవత్సరాలుగా సవరించకుండా ఉండటంతో వచ్చే నాలుగు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులను కూడా ఉద్యోగ భవిష్యనిధి సంస్థ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయం కోసం నాలుగు నెలల గడువు ఇచ్చింది. ప్రస్తుత వేతన పరిమితి గత పదకొండు సంవత్సరాలుగా సవరించకుండా ఉండటంతో, అధిక వేతనం పొందుతున్న లక్షలాది ఉద్యోగులు సామాజిక భద్రత ప్రయోజనాలకు దూరమవుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై నవీన్ ప్రకాశ్ నౌతియాల్ అనే ఉద్యమకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఏ.సి. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న కనీస వేతనాలు కూడా ఇప్పుడు రూ.15,000ను మించాయని గుర్తు చేశారు. అయినప్పటికీ, ఈపీఎఫ్వో వేతన పరిమితి పెంచకపోవడం వల్ల అనేకమంది ఉద్యోగులు ఈ పథకం కింద రక్షణ పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. వేతన పరిమితిని నిర్ణీత కాల వ్యవధిలో సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, గతంలో ఒకసారి సవరణకు 13 నుంచి 14 ఏళ్ల వరకు సమయం తీసుకున్న ఉదాహరణలు ఉన్నాయని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విధానం వల్ల సమానత్వ హక్కులు, సామాజిక భద్రత హక్కులు దెబ్బతింటున్నాయని వారు వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, తమ ఉత్తర్వులతో పాటు ఈ అంశాన్ని పిటిషనర్ రెండు వారాల్లో కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా విన్నవించాలని ఆదేశించింది. ఆ తర్వాత కేంద్రం ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, ఈపీఎఫ్వో కింద ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ వేతనంలో 12 శాతం చొప్పున భవిష్యనిధికి చెల్లించాలి. అయితే ఈ లెక్కింపు నెలకు గరిష్టంగా రూ.15,000 వేతనానికి మాత్రమే పరిమితం. అంటే, దీని ఆధారంగా నెలకు గరిష్టంగా రూ.1,800 వరకు మాత్రమే పీఎఫ్ కంట్రిబ్యూషన్ తప్పనిసరిగా ఉంటుంది. దీనికంటే ఎక్కువ శాలరీ ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ సభ్యత్వం స్వచ్ఛందంగా మారుతుంది. పూర్తి వేతనంపై పీఎఫ్ లాభాలు అందుబాటులో ఉండవు. వేతన పరిమితిని పెంచితే, అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఈపీఎఫ్వో పరిధిలోకి వస్తారు. దీంతో వారి రిటైర్మెంట్ భద్రత, పెన్షన్ లాభాలు, ఉద్యోగ మార్పుల సమయంలో నిధుల భద్రత మరింత మెరుగవుతుంది. అదే సమయంలో యజమానులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉద్యోగులు, యజమానులు ఇద్దరికీ కీలకంగా మారనుంది.
15వేల కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులను ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చే అంశం : కేంద్రానికి నాలుగు నెలల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు
الثلاثاء، 6 يناير 2026
000 A.C. Chandurkar heard Bringing employees earning more than Rs. 15 EPF Justices J.K. Maheshwari national Supreme Court gives the Centre four months' time
ليست هناك تعليقات:
إرسال تعليق