వన్ ప్లస్ నార్డ్ సిరీస్లో అత్యున్నత సాంకేతికతతో రాబోతున్న వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 5జీ ఇప్పుడు మొబైల్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఫోన్లో ఉండబోయే బ్యాటరీ సామర్థ్యం , కెమెరా ఫీచర్లు అత్యుతమైనవిగా వున్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థ ‘క్రోమా’ ఈ ఫోన్పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తుండటంతో, తక్కువ ధరలోనే ప్రీమియం ఫోన్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దాని బ్యాటరీ. సాధారణ ఫోన్లలో ఉండే 5000mAh కి భిన్నంగా, వన్ ప్లస్ ఇందులో ఏకంగా 7100mAh భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు సమాచారం. దీనివల్ల సాధారణ వినియోగదారులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు నిశ్చింతగా ఉండవచ్చు. దీనికి తోడు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల, కేవలం అరగంటలోనే బ్యాటరీ సగానికి పైగా ఛార్జి అవుతుంది. భారీ బ్యాటరీని కోరుకునే యువతకు, ట్రావెలర్లకు ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి. ఈ స్మార్ట్ఫోన్లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించబోతున్నారు. ఇది అత్యంత స్పష్టమైన ఫోటోలను , 4K వీడియోలను షూట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6.7 ఇంచుల AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ , సినిమా అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఈ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 30,000 ఉండవచ్చని అంచనా వేస్తుండగా, క్రోమా సేల్లో బ్యాంక్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ బోనస్లు కలిపి దీనిని రూ. 25,000 లోపు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా అధికారిక ముద్ర వేయనప్పటికీ, 2026 ప్రారంభంలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ホーム
/
technology
/
త్వరలో వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 5జీ విడుదల
الأحد، 28 ديسمبر 2025
6.7-inch AMOLED display along with a 120Hz refresh rate 7100mAh battery OnePlus Nord CE 5 5G to be released soon science smart phones technology
ليست هناك تعليقات:
إرسال تعليق