దక్షిణాఫ్రికా, జొహన్నెస్బర్గ్లోని ప్రెటోరియా సమీపంలో ఓ హాస్టల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందగా, మరో 14 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు జొహన్నెస్బర్గ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారు. కాల్పులు జరిపిందెవరో స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికారి అథ్లెండా మాథే తెలిపారు. మృతుల్లో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున 4.30 సమయంలో హాస్టల్కు వచ్చి తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఘటనాస్థలిలో మద్యం సీసాలు లభించాయి. దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారని,నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
0 Comments