తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. లారీ డ్రైవర్ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైరింజన్ల సహాయంతో మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఓ పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇథనాల్ ట్యాంకర్ను ఢీకొట్టిన లారీ : ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం
الخميس، 27 نوفمبر 2025
Criem Hanwada mandal Lorry hits ethanol tanker Mahabubnagar district National Highway No. 167 at Pilligundu Tanker driver burnt alive telangana
ليست هناك تعليقات:
إرسال تعليق