ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బాధిత కుటుంబాల ఇంటికి స్వయంగా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో 2లక్షల రూపాయల సాయం అందుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన రామ్మోహన్ నాయుడు ధైర్యంగా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
కాశీబుగ్గ తొక్కిసలాట : మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేత
الأحد، 2 نوفمبر 2025
Andhra Pradesh Cheques handed over to the families of the deceased Kasibugga stampede Union Minister Kinjarapu Rammohan Naidu and State Minister Atchannaidu
ليست هناك تعليقات:
إرسال تعليق