భారత్లో ఆఫ్ఘనిస్థాన్ తొలి దౌత్యవేత్తను నియమించబోతుంది. ఇది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో కీలక అడుగుగా అంతా బావిస్తున్నారు. తాలిబాన్ ఈ నెలలో మొదటి దౌత్యవేత్తను నియమించిన తర్వాత డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో మరో దౌత్యవేత్తను నియమించడానికి కాబూల్ భారత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఈక్రమంలోనే గత నెలలో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారతదేశంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కాబూల్లోని తన సాంకేతిక మిషన్ను రాయబార కార్యాలయం స్థాయికి పెంచాలని భారతదేశం నిర్ణయించింది. అంతేకాకుండా తాలిబాన్ దౌత్యవేత్తలను అంగీకరించడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసింది. త్వరలో ఇరుపక్షాలు తమ తమ మిషన్లకు ఛార్జ్ డి అఫైర్స్ స్థాయి అధికారిని నాయకత్వం వహించేలా చర్యలు తీసుకోనున్నాయి. ప్రభుత్వాన్ని భారత్ ఇంకా అధికారికంగా గుర్తించనప్పటికీ ఆఫ్ఘనిస్థాన్కు సహాయం అందించడంలో భారత్ నమ్మకమైన భాగస్వామిగా తన పాత్రను బలోపేతం చేసుకుంది. నిరంతరాయంగా అందిస్తున్న మానవతా సహాయం, వైద్య సామాగ్రి సరఫరా దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా భారత్ 16 టన్నులకు పైగా వ్యాధి నిరోధక మందులను అఫ్గానిస్థాన్కు విరాళంగా అందించగా.. తాలిబన్ ప్రతినిధి దీన్ని ప్రశంసించారు. 'ఈ విరాళం ఆఫ్ఘనిస్థాన్కు భారతదేశం అందిస్తున్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని, అభివృద్ధి మద్దతును నొక్కి చెబుతోంది.
ఆఫ్ఘనిస్థాన్ తొలి దౌత్యవేత్త నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ !
الاثنين، 3 نوفمبر 2025
Centre gives green signal to appoint Afghanistan's first diplomat national This is seen as a key step in the diplomatic ties between the two countries
ليست هناك تعليقات:
إرسال تعليق