ఆంధ్రప్రదేశ్లో మొంథా ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ నూనె, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, 1 కిలో చక్కెరను అందించనున్నారు. మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్కు బియ్యం, పప్పు, నూనె, చక్కెర సరఫరా చర్యలను వెంటనే ప్రారంభించమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయల సరఫరా బాధ్యతను మార్కెటింగ్ కమిషనర్కు అప్పగించింది.
తుపాను బాధితులకు ఉచిత నిత్యావసరాల పంపిణీకి జీవో జారీ!
الأربعاء، 29 أكتوبر 2025
Andhra Pradesh Fishermen's families will be given 50 kg of rice separately GO issued for free distribution of essential commodities to cyclone victims
ليست هناك تعليقات:
إرسال تعليق