విశాఖపట్నం లోని రిషికొండలో 18 ఎకరాల్లో భవనాలు కట్టారని, వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్ లో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'ఈ భవనాలను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదు. టూరిజం కోసం కడుతున్నట్లు అందరినీ నమ్మించారు. కోర్టులు జోక్యం చేసుకున్నా అధికారంతో దీనిని నిర్మించారు. నేను ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. కానీ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు ఎక్కడా చూడలేదు' అని ఆయన మండిపడ్డారు.
0 Comments