దేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఈమేరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. దీంతో ఎమ్మార్పీ ధర రూ.150.50గా ఉంటే రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉండనుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
విదేశీ బాటిళ్ల ఎమ్మార్పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు !
الأحد، 13 أكتوبر 2024
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసవరణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల పది రూపాయలకు పెంచుతూ విదేశీ బాటిళ్ల ఎమ్మార్పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు
ليست هناك تعليقات:
إرسال تعليق