హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓకి పెద్దగా డిమాండ్ కనిపించలేదు. సుమారు 10 కోట్ల షేర్లను ఐపీఓలో అమ్మకానికి పెట్టగా, మొదటి రోజు సుమారు 1.7 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. అంటే ఈ పబ్లిక్ ఇష్యూ 18 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన సుమారు 5 కోట్ల షేర్లలో 26 శాతం షేర్లకు కంపెనీ బిడ్స్ అందుకుంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన 2.12 కోట్ల షేర్లలో సుమారు 13 శాతం షేర్లకు బిడ్స్ దక్కించుకుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) పోర్షన్ 5 శాతం సబ్స్క్రిప్షన్ సాధించింది. 14.2 కోట్ల హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లను పేరెంట్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ తాజా ఐపీఓ, ప్రీ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్ ) కింద అమ్ముతోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.27,870 కోట్లను సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,315 కోట్లను సేకరించింది. కంపెనీ ఐపీఓ ఈ నెల 15-17 మధ్య ఓపెన్లో ఉంటుంది. ఒక్కో షేరు రూ.1,865-1,960 రేంజ్లో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ ఐపీఓకి కనిపించని డిమాండ్ !
الأربعاء، 16 أكتوبر 2024
10 కోట్ల షేర్లను ఐపీఓలో అమ్మకానికి 1మొదటి రోజు 8 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది business national science stock market technology హ్యుందాయ్ ఐపీఓకి కనిపించని డిమాండ్
ليست هناك تعليقات:
إرسال تعليق