ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం పేరును ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా మారుస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యోచించారు. ఇందులో భాగంగా భూముల సమగ్ర రీ సర్వే చేపట్టారు. అయితే ఈ పథకం ఆచరణలోకి వచ్చే సరికి అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీంతో బాధితులు లబో దిబోమన్నారు. 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష' పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పథకం పేరుతో చేస్తున్నతప్పులను అప్పటి ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే 'శాశ్వత భూ హక్కు- భూ రక్ష' పథకాన్ని ప్రక్షాళన చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
0 Comments