తమిళ హీరో శింబు తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించి వరద బాధితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళం ఇచ్చాడు. తాజాగా తెలుగు కాకుండా బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సహాయం చేసిన మొదటి సెలబ్రిటీగా నిలిచాడు. శింబు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు మూడు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో శింబు ఫ్యాన్స్, తెలుగు శింబు ఫ్యాన్స్ కూడా అతన్ని అభినందిస్తున్నారు. శింబు మనకు వల్లభ, మన్మధ.. లాంటి పలు సినిమాలతో దగ్గరైన సంగతి తెలిసిందే. ఇటీవల శింబు మానాడు, పాతుతల సినిమాలతో మంచి విజయాలు సాధించాడు.
తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు తమిళ హీరో శింబు విరాళం
Telugu Lo Computer
0
Comments
Post a Comment