ఆంధ్రప్రదేశ్ లో గణేశ్ మండపాలకు వివిధ రకాల చలాన్లు విధిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. హోంమంత్రి వంగలపూడి అనితను గణేశ్ మండపాలకు విధిస్తున్న చలాన్లపై టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత నిలదీశారు. అనితక్కా, ఏందినీ తిక్క.. ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తానని మాధవీలత పేర్కొన్నారు. ప్రతీ వాళ్లకు హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా అంటూ రెచ్చిపోయారు. మైక్ పర్మిషన్ కు 100 రూపాయలు, విగ్రహాలకు 350 ఇవ్వాలా ? ఇదే రూల్ ముస్లింలు, క్రిస్టియన్లకు పెట్టండి అంటూ మాధవీలత హోంమంత్రికి ఉచిత సలహా కూడా ఇచ్చారు.
0 Comments